Mahesh Babu: బ్లాక్‌ ఫారెస్ట్‌లో.. గడ్డ కట్టే చలిలో.. నమ్రత ఏమందంటే..! 

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:59 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌ కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. అక్కడ డాక్టర్‌గా పని చేస్తున్న హ్యారీ కొనిగ్‌ను మహేష్‌ కలుసుకున్నారు. మహేష్  బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్‌ ఆయన. ప్రస్తుతం మహేశ్‌ డాక్టర్‌తో పాటు జర్మనీ అడవుల్లో ట్రావెల్‌ చేస్తున్నారు.

Mahesh Babu: బ్లాక్‌ ఫారెస్ట్‌లో.. గడ్డ కట్టే చలిలో.. నమ్రత ఏమందంటే..! 

సూపర్‌స్టార్‌ మహేష్‌ (Maheshbabu) కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. అక్కడ డాక్టర్‌గా పని చేస్తున్న హ్యారీ కొనిగ్‌ను మహేష్‌ కలుసుకున్నారు. మహేష్  బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్‌ ఆయన. ప్రస్తుతం మహేశ్‌ డాక్టర్‌తో పాటు జర్మనీ అడవుల్లో ట్రావెల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. జర్మనీలోని బాడెన్‌ ప్రాంతంలో మహేశ్‌, తన ఫిట్‌నెస్‌ డాక్టర్‌ హ్యారీ కొనిగ్‌తో కలిసి బ్లాక్‌  ఫారెస్ట్‌ పర్వతంపై ట్రెక్కింగ్‌ చేశారు. గడ్డ కట్టించే చలిలో డాక్టర్‌ హ్యారీతో కలిసి మహేశ్‌ పెద్ద సాహసమే చేశారు.. ట్రెక్కింగ్‌  గురించి చెబుతూ మహేష్‌ ఒక పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేశ్‌ ఇలా కష్టపడుతున్నారని ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి-మహేశ్‌ కలయికలతో రాబోతున్న చిత్రం ఎక్కువగా అడవి ప్రాంతంలోనే జరుగనుందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన విషయం తెలిసిందే! 

Mahesh-babu.jpg

ఇన్స్టాలో మహేష్‌ బాబు పోస్ట్‌ చేసిన ఫోటోలను చూసిన ఆయన భార్య  నమ్రత.. ‘నిన్ను ఎంతో మిస్సవుతున్నా’ అంటూ లవ్‌ ఎమోజిస్‌తో ఎమోషనల్‌గా కామెంట్‌ చేశారు. నమ్రత చేసిన ఈ కామెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. "గుంటూరు కారం’ చిత్రం సమయం నుంచే 'ఎస్‌ఎస్‌ఎంబీ29' చిత్రం కోసం కసరత్తులు మొదలుపెట్టారు మహేష్‌. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకెళ్లనుందని తెలుస్తోంది. 


Updated Date - Jan 30 , 2024 | 11:11 AM