Nagarjuna: అసిస్టెంట్‌ కెమెరామెన్‍తో మహిళా నిర్మాత నిర్వాకం

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:43 PM

డబ్బు కోసం పెళ్లి పేరుతో మోసం చేయడంతోపాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది.

Nagarjuna: అసిస్టెంట్‌ కెమెరామెన్‍తో  మహిళా నిర్మాత నిర్వాకం

డబ్బు కోసం పెళ్లి పేరుతో మోసం చేయడంతోపాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ (lady producer) ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి డబ్బు దండుకుంది. తీరా ఆమె గురించి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో  కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ‘బైరవపురం’ సినిమా షూటింగ్‌ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లికతో పరిచయం ఏర్పడింది. సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆ  మహిళ నిర్మాత నాగార్జున బాబుకి ఫోన్ చేసి డిన్నర్‌కు ఆహ్వానించింది. డిన్నర్‌ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తాను గర్భం దాల్చానని నాగార్జునకు చెప్పింది. అంతకుముందే తనకు పెళ్లి అయిందనే విషయాన్ని చెప్పి భర్తకు విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకుందామని ఆశా మల్లిక నాగార్జున బాబుకు చెప్పింది. దీనికి కూడా అతను ఒప్పుకోవడంతో ఇద్దరు  చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతని నుంచి రూ. 18,50,000లను నేరుగా, మరో రూ. 10 లక్షలనును ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లోకి జమ చేయించుకుంది. డబ్బు అందాక ఆమె ప్రవర్తనలో మార్పు గమనించాడు నాగార్జున. తరచూ గొడవలు పడుతుండటంతో ఆమెపై అనుమానంతో వచ్చిన నాగార్జునబాబు  ఆరా తీయగా అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. కానీ తనకు ఒక వివాహం అయ్యిందని, పిల్లలు లేరని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసిందని గ్రహించాడు. 

గతంలోనూ ఆమె పలువురిపై పోలీస్‌ స్టేషన్ లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్‌ గాజువాక పోలీస్‌ స్టేషన్  లో భరత్‌ అనే వ్యక్తిపై, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్లో  శ్రీనివాస్‌ అనే వ్యక్తిపై, నార్సింగ్‌ ఠాణాలో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. తనను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నాగార్జున జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు. ఆశా మల్లికకు సంబంధించిన మోసాల చిట్టాను పోలీసుల ముందు ఉంచాడు. తాను నమోదు చేయించిన కేసును రాజీ చేసుకోవాలంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని నాగార్జునబాబు పోలీసులకు తెలిపారు. ఆశా మల్లికపై 389 ,420 ,419 ,494 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - Feb 08 , 2024 | 01:44 PM