మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Keerthy Bhat: దీన స్థితిలో ఉన్నానని  కూడా లేకుండా ఎక్కడెక్కడో తాకేవారు!

ABN, Publish Date - Apr 27 , 2024 | 11:39 AM

‘మనసిచ్చి చూడు’ సీరియల్‌తో తెలుగులో బుల్లితెరకు పరిచయమైంది కీర్తిభట్‌. ‘కార్తీకదీపం’లోనూ ఆమె నటించింది. 2022లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్  6లో సందడి చేసింది. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ తన జీవితాన్ని కుదిపేసింది.


‘మనసిచ్చి చూడు’ సీరియల్‌తో తెలుగులో బుల్లితెరకు పరిచయమైంది కీర్తిభట్‌ (keerthy Bhat). ‘కార్తీకదీపం’లోనూ (seriel actress) ఆమె నటించింది. 2022లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్  6లో సందడి చేసింది. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ తన జీవితాన్ని కుదిపేసింది. 2017లో కీర్తిభట్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా.. తల్లిదండ్రులు, అన్న-వదిన మృత్యువాతపడ్డారు.  కీర్తి మాత్రం ప్రాణాలతో బయట పడింది. కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత కోలుకుంది. మళ్లీ నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె ఇటీవల ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే జంటగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు.


‘ఫ్యామిలీకి యాక్సిడెంట్‌ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. నన్ను ఎక్కడెక్కడో తాకేవారని తెలిసేది కానీ బెడ్‌ మీద స్పర్శ లేని స్థితిలో ఉండటం వల్ల పక్కకు నెట్టే బలం కూడా ఉండేది కాదు. కాస్త కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆపదలో ఉన్నా స్నేహితుల ఇంటి దగ్గర దింపాలని ఆదుకోమని ఆటో వాళ్లని అడిగితే ‘200 ఇస్తా వస్తావా’ అంటే సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల చూపులు, తీరు చూసి అర్థమయ్యేది’ అని కీర్తి భట్‌ తనకు ఎదురైన దారుణాల్ని బయటపెట్టింది. ప్రస్తుతం ‘మధురానగరిలో’ సీరియల్‌ చేస్తోంది కీర్తి. 

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 27 , 2024 | 11:39 AM