Prasanth Varma: నా సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగ‌స్వామ్యం అవండి.. ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్టు వైర‌ల్‌

ABN , Publish Date - May 02 , 2024 | 09:45 PM

తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

Prasanth Varma: నా సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగ‌స్వామ్యం అవండి.. ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్టు వైర‌ల్‌
prasanth varma

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. శ్రీరామ నవమి రోజున సినిమా పోస్టర్‌ని విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.


తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం. "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి "talent@thepvcu.com"కి పంపండి! అంటూ త‌న సోష‌ల్ మీడ‌యా అకౌంట్‌లో పోస్టు చేశారు.

Updated Date - May 02 , 2024 | 09:45 PM