Guntur Kaaram Pre Release Event: గుంటూర్.. సిద్ధమా! సైన్యం వచ్చేస్తోంది

ABN , Publish Date - Jan 09 , 2024 | 05:46 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ రోజు గుంటూరులో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా చిత్ర యూనిట్ ప్రత్యేక విమానంలో గన్నవరం విమానశ్రయంలో దిగి గుంటూరుకు పయనమయ్యారు.

Guntur Kaaram Pre Release Event: గుంటూర్.. సిద్ధమా! సైన్యం వచ్చేస్తోంది
mahesh babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను రెండింతలు రెట్టింపు చేయగా రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ ఏకంగా 24 గంటల్లో 39 మిలియన్స్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా రికార్డులకెక్కింది.


అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈ క్రమంలో ఈ రోజు గుంటూరులో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram), దిల్ రాజు (Dil Raju ), శ్రీలీల (Sree leela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), సంగీత దర్శకుడు తమన్ (Thaman), నిర్మాతల నాగవంశీ ప్రత్యేక విమానంలో గన్నవరం విమానశ్రయంలో దిగి గుంటూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు ఫ్లైట్ లో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.

Updated Date - Jan 09 , 2024 | 06:13 PM