Guntur kaaram: ఈవెంట్‌ పోస్ట్‌పోన్ .. అభిమానులకు నిరాశే! 

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:49 PM

మహేష్‌బాబు (Maheshbabu) హీరోగా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం’ (guntur kaaram) చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో  భాగంగా ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల ఆరో తేదిన ఘనంగా నిర్వహించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. చివరి నిమిషంలో మేకర్స్‌ షాక్‌ ఇచ్చారు.

Guntur kaaram: ఈవెంట్‌ పోస్ట్‌పోన్ .. అభిమానులకు నిరాశే! 

మహేష్‌బాబు (Maheshbabu) హీరోగా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం’ (guntur kaaram) చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో  భాగంగా ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల ఆరో తేదిన ఘనంగా నిర్వహించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకకు హాజరు కావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో మేకర్స్‌ షాక్‌ ఇచ్చారు. ప్రీ రిలీజ్‌ పోస్ట్‌పోన్  (Pre release postpone) అయిందనే వార్తను సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే విపరీతంగా ప్రమోషన్ జరిగింది. ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌, టీజర్‌, పాటలు ఇలా ప్రతి అంశం సినిమాను బాగానే జనాల్లోకి తీసుకెళ్లింది. దాంతోపాటు నిర్మాత నాగవంశీ ట్వీట్లు, తూటాల్లాంటి మాటలు కూడా బాగానే వైరల్‌ అయ్యాయి. ఇవన్నీ సినిమాను బాగానే ప్రమోట్‌ చేశాయి. అయినా సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్‌ వేడుక సినిమాక మరింత హైప్‌ తీసుకొస్తుంది. టీవీ మాధ్యమాల వల్ల మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఆ వేడుక సెక్యూరిటీ, పర్మిషన్ తదితర కారణాల వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. 

Guntur karam.jpeg

"పలు కారణాల వల్ల ఆరో తేదిన జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగడం లేదు. అందుకు ఫ్యాన్స్  ప్రేక్షకులకు క్షమాపణ చెబుతున్నాం. ఈవెంట్‌ ఎప్పుడు అన్నది త్వరలో చెబుతాం. అంతవరకూ వేచి చూడండి’’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు అభిమానులను నిరుత్సాహపరిచారు. సినిమాకు పెద్ద దెబ్బె ఇది’ అని కామెంట్లు పెడుతున్నారు.

మహేష్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకుడు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్  పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. 


Updated Date - Jan 05 , 2024 | 07:49 PM