Allu Arjun: వైజాగ్‌లో బన్నీకి గ్రాండ్‌ వెల్కమ్‌!

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:37 PM

అల్లు అర్జున్  వైజాగ్‌ చేరుకున్నారు. ఆయన రాకతో ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ దగ్గర వేలాది మంది అభిమానులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన వెళ్లే మార్గం మొత్తం బన్నికి బైక్‌ ర్యాలీతో అదిరిపోయే రేంజ్‌లో వెల్కమ్‌ చెప్పారు.

Allu Arjun: వైజాగ్‌లో బన్నీకి గ్రాండ్‌ వెల్కమ్‌!

అల్లు అర్జున్ (Allu arjun) వైజాగ్‌ చేరుకున్నారు. ఆయన రాకతో ఫ్యాన్స్ హంగామా (Fans hungama in vizag) షురూ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ దగ్గర వేలాది మంది అభిమానులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన వెళ్లే మార్గం మొత్తం బన్నికి బైక్‌ ర్యాలీతో అదిరిపోయే రేంజ్‌లో వెల్కమ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను 'పుష్ప’ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా  విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

‘పుష్ప’తో (icon star allu arjun) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన 'పుష్ప-2' చిత్రంతో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిగింది. తాజా షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనుంది. దీని కోసం బన్ని విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు విమానాశ్రయం దగ్గర హంగామా చేశారు. పూల వర్షం కురిపించారు. ఐకాన్ స్టార్ కు  స్వాగతం పలికేందుకు అభిమానులు సముద్రంలా తరలివచ్చారు. 'పుష్ప-2 షూటింగ్‌ కోసం బన్నీ వైజాగ్‌లో అడుగుపెట్టారు. అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు’’ అని పుష్ప టీమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్‌ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Updated Date - Mar 11 , 2024 | 01:39 PM