నిర్మాణంలో వున్న నాని సినిమా హక్కులు తీసుకున్న దిల్ రాజు

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:04 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' రెండు రాష్ట్రాలకి కలిపి థియేట్రికల్ హక్కులు తీసుకున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఇంకా నిర్మాణంలో వున్న ఈ సినిమా హక్కులు దిల్ రాజు తీసుకోవటంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.

నిర్మాణంలో వున్న నాని సినిమా హక్కులు తీసుకున్న దిల్ రాజు
A still from Saripodhaa Sanivaaram

నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' షూటింగ్ జరుగుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ తమిళ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనపడతారు. డీవీవీ దానయ్య దీనికి నిర్మాత. ఈరోజు శనివారం కావటంతో ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన వార్త ఈరోజు విడుదల చేశారు.

saripodhaasanivaaramlaunch.jpg

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ 'సరిపోదా శనివారం' సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నట్టుగా సామజిక మాధ్యమం వేదికగా ప్రకటించింది. ఈరోజు శనివారం కావటంతో ఈ సినిమా టైటిల్ కూడా అలాగే ఉండటంతో ఈరోజు ఈ ప్రకటన రావటం ఆసక్తికరం.

ఇలా సినిమా నిర్మాణంలో ఉండగానే థియేటర్ హక్కులు కొనుక్కోవటం పరిశ్రమలో ఒక చర్చగా నడుస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే క్రేజ్ ఉన్నప్పటికీ, దిల్ రాజు ఇలా థియేటర్ హక్కులు తీసుకోవటంతో మరింత ఆసక్తికరం పెరిగింది అని అంటున్నారు. ఇది ఒక యాక్షన్ సినిమాగా తెరకెక్కనుంది అని కూడా తెలుస్తోంది.

Updated Date - Jan 20 , 2024 | 01:04 PM