మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దిల్ రాజు, శిరీష్ సోదరులు టాలీవుడ్ ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం

ABN, Publish Date - Feb 05 , 2024 | 03:53 PM

దిల్ రాజు, సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ వివాహానికి ఇటు చిత్ర పరిశ్రమలోని, అటు రాజకీయ రంగంలోని వారిని కుటుంబ సమేతంగా వెళ్లి కలిసి స్వయంగా శుభలేఖలు అందించి ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటివరకు అలా కలిసిన వారి ఫోటోలు...

DilRaju and Shirish invited actor Prabhas to grace the joyous occasion of Ashish wedding

దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ కలిపి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించడమే కాకుండా, ఎంతోమంది అగ్ర నటీనటులతో పెద్ద బడ్జెట్ సినిమాలు తీశారు. వీరిద్దరూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న నిర్మాతల్లో ప్రాముఖ్యం వున్నవారు అని చెప్పొచ్చు. శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' అనే సినిమాతో కథానాయకుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. అతనికి ఈ ఫిబ్రవరి 14న వివాహం జరగబోతోంది.

తమ ఇంట్లో జరగబోయే ఈ వివాహానికి, దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ వ్యక్తిగతంగా పరిశ్రమలో అందరినీ కలిసి శుభలేఖలు అందించటం జరుగుతోంది. ఇప్పటికే పలు నటులను కలిసి శుభలేఖ అందచెయ్యడం జరిగింది, అలాగే రాజకీయ నాయకులని కూడా కలిసి స్వయంగా ఆహ్వానాలు అందిస్తున్నారు దిల్ రాజు కుటుంబ సభ్యులు.

ఇప్పటికే వీరు చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ లను కలిసి స్వయంగా శుభలేఖలు అందించటం జరిగింది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కి కూడా స్వయంగా ఆహ్వానం పలికారు.

ఇక రాజకీయ నాయకుల్లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి అతనికి శుభలేఖ అందచేయడం జరిగింది. దిల్ రాజు, సోదరుడు శిరీష్, దిల్ రాజు కుమార్తె, దిల్ రాజు అల్లుడు మంత్రిగారిని కలిసి స్వయంగా ఆహ్వానించడం జరిగింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ను కూడా దిల్ రాజు సోదరులు కలిసి ఆశిష్ వివాహానికి స్వయంగా శుభలేఖ అందించి ఆహ్వానం పలికారు. కేసీఆర్ ఇంటికి వెళ్లి దిల్ రాజు సోదరులు కలిసి ఈ శుభలేఖ అందచేశారు.

Updated Date - Feb 05 , 2024 | 03:53 PM