Devara: ఎన్టీఆర్‌ ఏం చేస్తున్నారంటే!

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:42 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. కొంతగ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు

Devara:  ఎన్టీఆర్‌ ఏం చేస్తున్నారంటే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Ntr)హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకుడు(Koratala siva). కొంతగ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శివ. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సన్నివేశాలను ఎన్టీఆర్‌, మురళీశర్మ తదితరులపై చిత్రీకరణ చేస్తున్నారు. దాంతోపాటు పలు యాక్షన్ సన్నివేశాలు కూడా అక్కడ ప్లాన్ చేశారు.

ఈ చిత్రంలో  ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్ ఓ ప్రమాదంలో గాయాలపాలు కావడంతో ఆయన కొద్దిరోజులుగా రెస్ట్‌లో ఉన్నారు.  కోలుకుని సెట్‌లో అడుగుపెట్టడానికి ఇంకాస్త సమయం పడుతుందని సమాచారం. ఆయన కోసమే షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. ఆలస్యం కావడంతో ప్రస్తుతం తారక్‌తోపాటు ఇతర తారాగణంపై గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండు భాగాలుగా ప్లాన్  చేసిన ఈ చిత్రం మొదటి పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల చేత అక్టోబర్‌ 10 తేదీకి వాయిదా పడింది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఆమెపై కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యుదసుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్‌, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

Updated Date - Mar 05 , 2024 | 11:02 AM