Chiranjeevi: పీవీకి భారతరత్న.. తెలుగువారు గర్వించే క్షణం!

ABN , Publish Date - Feb 09 , 2024 | 04:25 PM

తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Chiranjeevi: పీవీకి భారతరత్న.. తెలుగువారు గర్వించే క్షణం!

తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు (Pv Narasimha rao) భారతరత్న (Bharat Ratna) ప్రకటించడంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేశారు. '’నిజమైన దార్శనికుడు, పండితుడు, బహు భాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు భారతరత్న రావడం మనందరికీ గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునికి భారతదేశాన్ని మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి. ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరూ తో పాటు తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం ఈ గౌరవం లభించడం ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పది ఏమీ ఉండదు’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు 

Updated Date - Feb 09 , 2024 | 04:27 PM