Chiranjeevi: అభిమాని వినూత్న శుభాకాంక్షలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:07 PM

మెగాస్టార్‌కు దేశంలో రెండో అత్యున్నత పురస్కారం  పద్మ విభూషణ్‌ వరించింది. దాంతో ఆయనతోపాటు, ఫ్యాన్స్  ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చిరంజీవి మీదున్న ప్రేమను వినూత్నంగా చూపించి అభినందనలు తెలిపాడు.

Chiranjeevi: అభిమాని వినూత్న శుభాకాంక్షలు

సినిమా ఇండస్ట్రీలో  ఎలాంటి నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి నంబర్‌వన్  స్థానంలో ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). సినిమాకు, సొసైటీకి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. తాజాగా మెగాస్టార్‌కు దేశంలో రెండో అత్యున్నత పురస్కారం  పద్మ విభూషణ్‌ వరించింది. దాంతో ఆయనతోపాటు, ఫ్యాన్స్  ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చిరంజీవి మీదున్న ప్రేమను వినూత్నంగా చూపించి అభినందనలు తెలిపాడు. కుందరపు శ్రీనివాస్‌ అనే వ్యక్తి ప్రఖ్యాత న్యూయార్క్‌ టైం స్క్వేర్ స్ట్రీట్ (Newyork Time Square) లోని బిగ్‌స్ర్కీన్‌పై చిరంజీవి ఫోటో ప్రదర్శించాడు. ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన అభిమాన హీరో మెగాస్టార్‌కు శుభాకాంక్షలు’’ అని తెలిపారు. అయితే ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ దక్షిణాదిలో కొందరు స్టార్లు మాత్రం చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌లో అమితాబ్‌, తమిళ పరిశ్రమ నుంచి, కమల్‌హాసన,  రజినీకాంత్‌, సుహాసిని, మణిరత్నం లాంటి ఎందరో చిరుకి శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్‌ కూడా వేయలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తోటి నటుడు అయిన బాలకృష్ణ కూడా ఎక్కడా స్పందించలేదు.

ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ఫాంటసీ చిత్రం విశ్వంభర చేస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 


Updated Date - Jan 30 , 2024 | 04:15 PM