SSMB29: మహేష్‌ సరసన ఇండోనేషియా బ్యూటీ?

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:28 AM

మహేష్‌బాబు(Maheshbabu) , ఎస్‌ఎస్‌.రాజమౌళి (Rajamouli) కాంబోలో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) సినిమా ప్రకటించినప్పటి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

SSMB29:  మహేష్‌ సరసన ఇండోనేషియా బ్యూటీ?

మహేష్‌బాబు(Maheshbabu) , ఎస్‌ఎస్‌.రాజమౌళి (Rajamouli) కాంబోలో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) సినిమా ప్రకటించినప్పటి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. సినిమా కథ నుంచి  నటీనటుల వరకూ ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా మరో వార్త నెట్టింట షికారు చేస్తోంది. ఈ చిత్రం హీరోయిన్  ఎవరనే అంశం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించనున్న రాజమౌళి.. దానికి తగ్గట్లు విదేశీ నటులనూ ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్‌. ఈ మేరకు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ (chelsea elizabeth islan) ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనే వార్త వైరల్‌ అవుతోంది. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇంతకుముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు మహేశ్‌ సరసన నటించే ఛాన్స ఉందంటూ గాసిప్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే! ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని తెలుస్తోంది.

Chelsi.jpg

చెల్సియా గురించి చెప్పాలంటే ఆమె జకార్తాలో చదువు పూర్తి చేసి 2013లో హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘రిఫ్రైన్‌’తో వెండితెరకు పరిచయం అయింది. తర్వాత ‘స్ర్టీట్‌ సొసైటీ’, ‘హెడ్‌షాట్‌’, ‘మే ది డెవిల్‌ టేక్‌ యు’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. మరోవైపు, మార్వెల్‌ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని కథనాలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.  

Chelsi-2.jpg

Updated Date - Feb 12 , 2024 | 11:28 AM