Aswani Dutt- Kalki : చంద్రబాబును కలిసిన ఆనందంలో..

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:54 PM

‘కల్కి’ చిత్ర నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత నిర్మాత అశ్వినీదత్‌ తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు

Aswani Dutt- Kalki : చంద్రబాబును కలిసిన ఆనందంలో..

‘కల్కి’ (Kalki) చిత్ర నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత నిర్మాత అశ్వినీదత్‌ (Aswini dutt) తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు  వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో అభినందనలు తెలిపిన అశ్వినిదత్‌.. తాజాగా చంద్రబాబును (Chandra babu) మర్యాదపూర్వకంగా కలిశారు.

Bachan.jpg
 
మరోవైపు ఆయన నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా జూన్‌ 26న  విడుదల కానుంది. అక్కడ దీని అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో రిలీజ్‌ చేస్తున్నారు.  ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన తన బ్లాగ్‌లో షేర్‌ చేసిన ఓ అప్‌డేట్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ‘మరో బిజీ డే. నా అప్‌కమింగ్‌ సినిమాలోని పాటకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాను. త్వరలోనే అది మీ ముందుకు రానుంది’ అని రాశారు. దీంతో కల్కి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే అని అభిమానులు భావిస్తున్నారు. శుక్రవారం చిత్రబృందం అమితాబ్‌కు సంబందించిన కొత్త పోస్టర్‌ను పంచుకొని జూన్‌ 10న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పశుపతి, దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది.

Updated Date - Jun 07 , 2024 | 03:54 PM