Ashika Ranganath: ముచ్చటగా మూడో సినిమా మెగాస్టార్‌తో... 

ABN , Publish Date - May 24 , 2024 | 03:02 PM

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు

Ashika Ranganath: ముచ్చటగా మూడో సినిమా మెగాస్టార్‌తో... 

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌(Ashika Ranganath) బంపర్‌ ఆఫర్‌ కొట్టింది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా  పోస్ట్‌ చేసింది. 'అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్థంగా ఉండాలని' నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆషిక.. ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో నటించింది.  తెలుగులో ముచ్చటగా మూడో సినిమానే మెగాస్టార్‌తో నటించే అవకాశం అందుకోవడంతో ఆమె ఫ్యాన్స్  సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Ranganath.jpg

సోషియో ఫాంటసీ చిత్రంగా 'విశ్వంభర' రూపొందుతోంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది.స్టార్‌ హీరోయిన త్రిష్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషాచావ్ల, మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated Date - May 24 , 2024 | 03:02 PM