Anushka Shetty: అమ్మాయికి జరిగిన అన్యాయంపై పోరాటం!

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:09 PM

గత ఏడాది 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రంతో మెప్పించారు అనుష్కశెట్టి (Anushka Shetty). తాజాగా ఆమె యు.వి క్రియేషన్స్  బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Anushka Shetty: అమ్మాయికి జరిగిన అన్యాయంపై పోరాటం!


గత ఏడాది 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రంతో మెప్పించారు అనుష్కశెట్టి (Anushka Shetty). తాజాగా ఆమె యు.వి క్రియేషన్స్  బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆరు నెలల తర్వాత మళ్లీ స్వీటీ మేకప్‌ వేసుకుని సెట్‌లో అడుగుపెట్టింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ ఒడిస్సాలో ప్రారంభమైంది. అనుష్క ఒడిస్సాలోని సెట్‌కి చేరుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ‘వేదం’ తరవాత అనుష్క, క్రిష్‌ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.


Anushka.jpg
తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందన్నదే కథ.  మహిళా ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో ఓ కథానాయకుడు కూడా ఉన్నారు. అతనెవరు అనేది తెలియాల్సి ఉంది. రాజీవ్‌ రెడ్డి, ప్రమోద్‌ నిర్మాతలు.. యూవీ సంస్థలో అనుష్క ‘భాగమతి 2’ చేయాల్సింది. దర్శకుడు అశోక్‌ కథ కూడా రెడీ చేసుకొన్నాడు. కానీ.. అనుష్క మాత్రం క్రిష్‌ సినిమాకే మొదటి ప్రాధాన్యం ఇచ్చింది.  కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.  

Updated Date - Feb 11 , 2024 | 08:09 PM