Anand Ranga: నెటిజన్ కామెంట్‌కు దర్శకుడు సింపుల్‌ రిప్లై! 

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:53 AM

సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్‌ పెడితే అది ఎంతగా వైరల్‌ అవుతోందో తెలిసిందే! ఆ పోస్ట్‌లకు పాజిటివ్‌, నెగటివ్‌ కామెంట్స్‌ క్యూ కట్టేస్తుంటాయి. కొందరైతే లెక్క లేకుండా ఏదో పడితే అది రాస్తుంటారు. తాజాగా ఇలాంటి అనుభవమే దర్శకుడు ఆనంద్‌ రంగాకి ఎదురైంది.

Anand Ranga:  నెటిజన్ కామెంట్‌కు దర్శకుడు సింపుల్‌ రిప్లై! 

సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్‌ పెడితే అది ఎంతగా వైరల్‌ అవుతోందో తెలిసిందే! ఆ పోస్ట్‌లకు పాజిటివ్‌, నెగటివ్‌ కామెంట్స్‌ క్యూ కట్టేస్తుంటాయి. కొందరైతే లెక్క లేకుండా ఏదో పడితే అది రాస్తుంటారు. తాజాగా ఇలాంటి అనుభవమే దర్శకుడు ఆనంద్‌ రంగాకి ఎదురైంది. ఓ నెటిజన్  పెట్టిన పోస్ట్‌పై ఆయన సరదా కామెంట్‌ చేశారు. అయితే నెటిజన్  కామెంట్‌ను ఆయన సిల్లీగా తీసుకున్నారు. 

2009లో ఆనంద్‌ రంగా తెరకెక్కించిన ‘ఓయ్‌’ చిత్రం ఈ నెల 14న రీ రిలీజ్‌ కానుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ఆనంద్‌ పోస్టర్‌ షేర్‌ చేశారు. ఆ చిత్రాన్ని ఇష్టపడేవారు మా ఏరియాలోనూ విడుదల చేయండి సర్‌ అని కామెంట్లు పెట్టారు. అది నా చేతుల్లో లేదు. డిస్ట్రిబ్యూటర్ల  చేతుల్లో ఉంటుందని డైరెక్టర్‌ చెప్పారు. ఈ క్రమంలో ఓ నెటిజన్  మాత్రం వింతగా కామెంట్‌ చేశాడు. ‘‘గుండు.. ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు వెళ్లిపోయావ్‌?’’ అని ఒకరు అడగ్గా.. ఆయన స్మైలీ ఎమోజీ పోస్ట్‌ చేశారు. దర్శకుడి రిప్లై చూసి షాక్‌ అయిన నెటిజన్ అలా పిలిచినందుకు సారీ చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు. మీరు అన్నది నిజమే’ అని ఆయన పేర్కొన్నారు. గుండుతో ఉన్న ప్రొఫైల్‌ పిక్చర్‌ పెట్టడమే దీనికి కారణం. సిద్థార్థ్‌, షామిలీ జంటగా నటించిన ఈ సినిమా 2009 జులై 3న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆనంద్‌ రంగా మరో సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఓటీటీల కోసం ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేర్‌’, ‘వ్యవస్థ’ తదితర వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించారు

Updated Date - Feb 02 , 2024 | 12:47 PM