OTT- Ambajipeta Marriage Band: ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడంటే..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:11 AM

'కలర్‌ఫొటో' ఫేం సుహాస్‌(Suhas), శివానీ (Shivani) జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. నితిన్‌ ప్రసన్న,శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని అందుకుంది.

OTT- Ambajipeta Marriage Band: ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడంటే..!

'కలర్‌ఫొటో' ఫేం సుహాస్‌(Suhas), శివానీ (Shivani) జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’(Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. నితిన్‌ ప్రసన్న,శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని అందుకుంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ సినిమా రైట్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘త్వరలోనే మీ ముందుకు ఈ సినిమా వస్తుంది’ అంటూ ‘ఆహా’ (Aha OTT) సంస్థ ఇటీవల ప్రకటించింది. తాజాగా రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసింది. మార్చి 1 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్  కానుంది.





కథ:
అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఓ సభ్యుడు మల్లి (సుహాస్‌). చిరతపూడిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్‌) ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్‌బాబు (నితిన్‌ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే వదంతు మొదలవుతుంది. ఇంతలో వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మి (శివాని నాగారం), మల్లి ప్రేమలో పడతారు. వెంకట్‌బాబు తమ్ముడికి, మల్లికి మధ్య ఊళ్లో గొడవ, ఆ తర్వాత స్కూల్‌ విషయంలో పద్మకీ, వెంకట్‌బాబుకీ మధ్య గొడవలు మొదలవుతాయి. అవి కాస్త పెద్దగా మారతాయి. ఇంతలో మల్లి, లక్ష్మిల ప్రేమ గురించి బయటపడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై  ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకట్‌బాబు... రాత్రి వేళలో పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లి, లక్ష్మీ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనేది కథ. 

Updated Date - Feb 27 , 2024 | 11:11 AM