Harihara Veeramallu: ఆగిపోలేదు.. పవన్‌ కల్యాణ్‌ మరోస్థాయికి వెళ్తారు!

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:01 PM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పవన్  కల్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ వాయిదా పడుతోంది.

Harihara Veeramallu: ఆగిపోలేదు.. పవన్‌ కల్యాణ్‌ మరోస్థాయికి వెళ్తారు!

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా క్రిష్‌ జాగర్లమూడి (Krish) తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పవన్  కల్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ వాయిదా పడుతోంది. అయితే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్‌ లేకపోవడంతో ఆగిపోయిందంటూ కొంతకాలంగా రకరకాలు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నోసార్లు నిర్మాత స్పందించినా రూమర్స్‌ ఆగలేదు. తాజాగా మరోసారి వాటన్నిటికీ నిర్మాత ఏఎమ్‌ రత్నం చెక్‌ పెట్టారు. తాజాగా ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన సినిమాపై కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు.

'‘పవన్‌కల్యాణ్‌తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్‌ తీసుకొని ఏదో ఒకటి తీయెచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా  గుర్తుండిపోవాలి. ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తోన్న మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. ఆ మాటల్ని నమ్మాల్సిన అవసరంలేదు. ‘హరిహర వీరమల్లు’ ఆగిపోలేదు. దీనికి రెండో భాగం  కూడా ఉంది. ఈ చిత్రంతో పవన్‌ కల్యాణ్‌ మరోస్థాయికి వెళ్తారు’ అని ఎ.ఎం.రత్నం (AM Rathnam) అన్నారు. 

ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తోపాటు ఇరాన్‌, కెనడాలో జరుగుతున్నాయని, ఫ్యాన్స ఊహకు మించి ఈ చిత్రం ఉండబోతోందని నిర్మాత గతంలో ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే!  మొఘలుల కాలం నాటి చారిత్రక కథతో రూపొందుతున్న చిత్రమిది. నిధీ అగర్వాల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 

Updated Date - Feb 27 , 2024 | 04:01 PM