Allu Arjun: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే అక్కడికి వెళ్లా!

ABN , Publish Date - May 13 , 2024 | 03:03 PM

తనకు రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఐకానస్టార్‌ అల్లు అర్జున్  అన్నారు. జూబ్లీహిల్‌ బీఎస్‌ఎన్ఎల్‌ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

Allu Arjun: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే అక్కడికి వెళ్లా!

తనకు రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఐకానస్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. జూబ్లీహిల్‌ బీఎస్‌ఎన్ఎల్‌ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం  లేదు. నాకు అన్ని పార్టీలు ఒకటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్‌ కల్యాణ్‌కు(PAwan kalyan) నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవిగారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. ఒకవేళ భవిష్యత్‌లో మా మావయ్య చంద్రశేఖర్‌గారు, బన్నివాస్‌ ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులు ఎవరైనా మద్దతు కోరితే  తప్పకుండా వారికి సపోర్ట్‌గా నిలుస్తా. శిల్పా రవి 15 ఏళ్లుగా నాకు స్నేహితుడు. ‘బ్రదర్‌ మీరెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే మీ ఊరు వచ్చి సపోర్ట్‌ చేస్తా’ అని మాటిచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. ఇచ్చిన నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనపడాలని నా మనసులో ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే ఫోన్‌ చేసి వస్తానని చెప్పా. అందుకే నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లాను. వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు’’ అని అన్నారు.

 

Updated Date - May 13 , 2024 | 03:04 PM