Chiranjeevi: స్వయంకృషికి పద్మ విభూషణం! 

ABN , Publish Date - Jan 26 , 2024 | 01:59 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ వరించింది.

Chiranjeevi: స్వయంకృషికి పద్మ విభూషణం! 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని (Chiranjeevi) దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ వరించింది. ఈ పురస్కారం చిరంజీవి స్వయంకృషికి తగ్గ ప్రతిఫలంగా సినీ ప్రియులు, అభిమానులు కొనియాడుతున్నారు. 

అయితే ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో పద్మ విభూషణ్‌( Padma Vibhushan) పురస్కారం ఇద్దరకి మాత్రమే దక్కింది. తొలుత 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. టాలీవుడ్‌లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు (ANR). ఆయనకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, జాతీయ స్థ్థాయిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో పేరొందిన అవార్డులు అందుకున్నారు ఏయన్నార్‌. తాజాగా ఆ ఘనత మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆ ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. దక్షిణాదికి చెందిన కళారంగంలో తమిళనాట ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం(2021), ఇళయరాజా (2018), కె.జె.ఏసుదాసు(2017), రజనీకాంత (2016) వంటి ఉద్దండులకు పద్మ విభూషణ్‌ వరించింది. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈ పురస్కార ఘనత అక్కినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత చిరంజీవికే దక్కింది.

Chiranjeevi 2.jfif

సినీ రంగానికి మెగాస్టార్‌ చిరు చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ అవార్డు ఇచ్చింది. 1987లో స్వయం కృషి, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా చిరు నంది అవార్డులు అందుకున్నారు. శుభలేఖ, విజేత, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రి, స్నేహంకోసం, ఇంద్ర, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ చిత్రాలకు గాను బెస్ట్‌ యాక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్‌ ఫర్‌ హానరరీ లెజెండరీ యాక్టింగ్‌ కెరీర్‌ పేరిట చిరంజీవి స్పెషల్‌ అవార్డును ఫిలింఫేర్‌ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.  2022లో గోవాలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఇఫి)లో ఇండియన ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఈయర్‌ అవార్డును అందుకున్నారు చిరు. 

Chiranjeevi.jpg


Updated Date - Jan 26 , 2024 | 02:02 PM