Suriya: అభిమానుల సేవ గుర్తించి సూర్య ఏం చేశారంటే..

ABN , Publish Date - Mar 04 , 2024 | 06:01 PM

సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు తమిళ హీరో సూర్య (Suriya). అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యం, విద్యా ఉపాధి సదుపాయాలను అందిస్తున్నారు.  ఆయన మరోసారి మంచి మనసు చాటుకున్నారు.

Suriya: అభిమానుల సేవ గుర్తించి సూర్య ఏం చేశారంటే..

సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు తమిళ హీరో సూర్య (Suriya). అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యం, విద్యా ఉపాధి సదుపాయాలను అందిస్తున్నారు.  ఆయన మరోసారి మంచి మనసు చాటుకున్నారు. గతంలో మిగ్‌జాం తుఫాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన అభిమానులకు విందు ఇచ్చారు. దగ్గరుండి అందరికీ వడ్డించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  (Suriya Meet and great with fans)

గతేడాది డిసెంబర్‌లో మిగ్‌జాం తుఫాను దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా వర్షం తాకిడికి ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో తన అభిమానులందరూ స్వచ్భందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్స్ వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలు చేశారు. వారి సేవలను గుర్తించిన సూర్య వారందరినీ విందుకు ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. సూర్య అభిమానుల్లో కొత్తగా పెళ్లైన 50 జంటలను కూడా విందుకు ఆహ్వానించి స్వయంగా ఆయనే భోజనం వడ్డించారు.

సూర్య సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ‘కంగువా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన చేస్తున్నారు. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Updated Date - Mar 04 , 2024 | 06:06 PM