Sudha kongara: చియాన్‌ విక్రమ్‌ను డైరెక్ట్‌ చేయనున్న సుధా కొంగర..

ABN , Publish Date - May 23 , 2024 | 09:20 PM

‘సూరరైపోట్రు (Soorarai Pottru) చిత్రం ద్వారా జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర (Sudha kongara) తన తదుపరి చిత్రంలో చియాన్‌ విక్రమ్‌ను (Vikram) డైరెక్ట్‌ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి

Sudha kongara: చియాన్‌ విక్రమ్‌ను డైరెక్ట్‌ చేయనున్న సుధా కొంగర..

‘సూరరైపోట్రు (Soorarai Pottru) చిత్రం ద్వారా జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర (Sudha kongara) తన తదుపరి చిత్రంలో చియాన్‌ విక్రమ్‌ను (Vikram) డైరెక్ట్‌ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ (Tangalan)చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘వీర ధీర సూరన్‌’ చిత్రం షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. అలాగే, సుధా కొంగర దర్శకత్వంలో నటించేందుకు సమ్మతం తెలిపినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సూర్య హీరోగా సుధా కొంగర తెరకెక్కించిన ‘సూరరైపోట్రు’ చిత్రం ఘన విజయం సాధించడంతోపాటు ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్‌, ఉత్తమ సంగీత దర్శకుడు ఇలా పలు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది. దీంతో సూర్య - సుధా కొంగరలు మరోమారు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి ‘పురాణనూరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ తర్వాత మదురైలోని అమెరికన్‌ కాలేజీలో షూటింగ్‌ కూడా ప్రారంభించారు. 1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించేలా కథను సిద్ధం చేశారు. అయితే హీరో సూర్య ముంబైలో స్థిరపడి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా ‘పురాణనూరు’ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో సుధా కొంగర మరో కథను సిద్ధం చేసుకుని హీరోలు ధృవ్‌ విక్రమ్‌, శివకార్తికేయన్‌, చియాన్‌ విక్రమ్‌లకు వినిపించారు. ఇందులో విక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయనతో కలిసి సుధా కొంగర చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated Date - May 23 , 2024 | 09:20 PM