40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Santhanam: స్నేహితులం కానీ.. మా కోసం ఎందుకు ఆరా తీస్తారంటే!

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:22 PM

నటుడు సంతానం (Santhanam) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వడక్కుపట్టి రామస్వామి’ (vadakkupatti ramasamy) పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై రూపొందిన ఈ చిత్రానికి కార్తిక్‌ యోగి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కానుంది.

నటుడు సంతానం (Santhanam) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వడక్కుపట్టి రామస్వామి’ (vadakkupatti ramasamy) పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై రూపొందిన ఈ చిత్రానికి కార్తిక్‌ యోగి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదలై చర్చనీయాంశంగా మారింది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.  నటుడు ఆర్య (Arya) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంతానం మాట్లాడుతూ.. ‘నేను, ఆర్య చాలా ఏళ్లగా మంచి స్నేహితులం. నేను ఎక్కడికి వెళ్లినా ఆర్య ఎక్కడని అడుగుతారు. అదే  విధంగా ఆర్యతో నా గురించి అడుగుతారు. అయితే ఆ ప్రశ్న మేం మంచి స్నేహితులం అని కాదు. చాలా అప్పులు చేశాం. అందుకనే చాలామంది మా గురించి ఆరా తీస్తుంటారు. ఈ సినిమా పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. వినోదానికి ఏమాత్రం కొదవ ఉండదు. నా అభిమానులు  కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి’ అని అన్నారు. 

‘టిక్కిలోనా’ చిత్రం తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. పెద్ద బడ్జెట్‌ చిత్రం. సంతానం బాగా సహకరించారు. మళ్లీమళ్లీ ఆయనతో సినిమలు చేయాలనుంది’’ అని దర్శకుడు కార్తిక్‌ యోగి అన్నారు. 

Updated Date - Jan 28 , 2024 | 12:22 PM