Radhika Sarathkumar: ఆ సినిమాపై అసహనంతో పోస్ట్‌! 

ABN , Publish Date - Jan 27 , 2024 | 04:43 PM

ఇటీవల తను వీక్షించిన ఓ సినిమా గురించి అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్‌ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar) సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

Radhika Sarathkumar: ఆ సినిమాపై అసహనంతో పోస్ట్‌! 

ఇటీవల తను వీక్షించిన ఓ సినిమా గురించి అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్‌ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar) సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్‌ ఏంటంటే ‘‘ఏదైనా సినిమా చూసి మీరు విసిగిపోయారా? నాకు అయితే ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేయాలనిపించింది. చాలా ఆగ్రహంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాధిక మాట్లాడుతున్నది తాజాగా ఓటీటీలో విడుదలైన ‘యానిమల్‌’ సినిమా గురించేనని పోస్ట్‌లు పెడుతున్నారు.  ‘‘మీరు మాట్లాడుతున్నది ‘యానిమల్‌’ గురించే కదా మేడమ్‌’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. రాధిక మాత్రం తాను ఏ చిత్రం గురించి మాట్లాడుతున్నదనేది చెప్పలేదు. 

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక నటించిన జంటగా నటించిన ‘యానిమల్‌’ 9Animal) రిపబ్లిక్‌ డే సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  స్ట్రీమింగ్  అవుతోంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో హింసలు తీవ్రస్థాయిలో చూపించారని విమర్శలు వ్యక్త మయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో స్త్రీని  తక్కువ చేసి చూపించారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ క్రమంలోనే రాధిక ట్వీట్‌ చేయడంతో ఆమె మాట్లాడుతున్నది ఈ చిత్రం గురించేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - Jan 27 , 2024 | 04:43 PM