మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ajith Kumar: మైత్రీ మూవీ మేకర్స్‌ ఆసక్తికర  ప్రకటన!

ABN, Publish Date - Mar 14 , 2024 | 10:31 PM

తమిళస్టార్‌ హీరో అజిత్ (Ajithkumar)తో ఓ సినిమా చేయనున్నట్లు మైత్రీమూవీ మేకర్స్‌ (mythri movie makers) సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ అంటూ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

తమిళస్టార్‌ హీరో అజిత్ (Ajithkumar)తో ఓ సినిమా చేయనున్నట్లు మైత్రీమూవీ మేకర్స్‌ (mythri movie makers) సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ అంటూ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అజిత్‌ సినిమాతో  మైత్రీ సంస్థ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.  విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ’తో మంచి హిట్‌ అందుకున్న అధిక్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

‘‘అజిత్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అధిక్‌ స్క్రిప్ట్  అద్భుతంగా ఉంది. సినీ ప్రియులకు మంచి అనుభవాన్ని అందిస్తామన్న నమ్మకం ఉంది’’ అని మైత్రీ సంస్థ పేర్కొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అజిత్‌, అధిక్‌ కోలీవుడ్‌లో మంచి స్నేహితులు. ‘నేర్కొండ పార్వై’ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ‘మార్క్‌ ఆంటోనీ’ సక్సెస్‌ మీట్‌లోను అజిత్‌ను గుర్తుచేసుకుంటూ అధిక్‌ మాట్లాడారు.

Updated Date - Mar 14 , 2024 | 10:31 PM