Rayaan:‘త‌ల‌వంచి ఎర‌గ‌డే.. త‌ల‌ప‌డితే వ‌ద‌ల‌డే’.. ధ‌నుష్ ‘రాయ‌న్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌

ABN , Publish Date - May 10 , 2024 | 01:24 PM

త‌మిళ, తెలుగు భాష‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ధ‌నుష్. కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా త‌ర్వాత ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వం చేస్తూ న‌టిస్తున్న చిత్రం రాయన్. అస్కార్ గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు.

Rayaan:‘త‌ల‌వంచి ఎర‌గ‌డే.. త‌ల‌ప‌డితే వ‌ద‌ల‌డే’.. ధ‌నుష్ ‘రాయ‌న్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌
rayaan

త‌మిళ, తెలుగు భాష‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ధ‌నుష్ (Dhanush). కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా త‌ర్వాత ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వం చేస్తూ న‌టిస్తున్న చిత్రం రాయన్ (Raayan). డీ 50 గా వ‌స్తున్న ఈ సినిమా టైటిల్‌, గ్లిమ్స్‌ను ఇప్ప‌టికే విడ‌ద‌లై సినిమాపై మంచి బ‌జ్‌ను తీసుకువ‌చ్చాయి. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా సందీప్ కిష‌న్ (Sundeep Kishan) , కాళిదాస్ (kalidas jayaram), ఎస్‌జే సూర్య‌, ఆప‌ర్ణ బాల ముర‌ళి, అనైక సురేంద్ర‌న్ వంటి అగ్ర తారాగ‌ణం ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

అస్కార్ గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి గురువారం సాయంత్రం సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌గా లిజ‌న‌ర్స్ నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటోంది.. ‘త‌ల‌వంచి ఎర‌గ‌డే.. త‌ల దించి న‌డ‌వ‌డే.. త‌ల‌ప‌డితే వ‌ద‌ల‌డే’ అంటూ ఈ సాగే పాట‌ను అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ సాహిత్యం అందించ‌గా హేమ‌చంద్ర‌, శ‌ర‌త్ సంతోష్ ఆల‌పించారు. రెహ‌మాన్ అందించిన సంగీతం చాలా క్యాచీగా ఉండి హీరో వ్య‌క్తిత్వాన్ని తెలిపేదిగా ఉంది.

GNHWEaGaAAAmUCq.jpeg


ఇక‌పోతే..గ‌తంలో ప‌వ‌ర్ పాండి అనే సినిమాకు ద‌ర్శ‌కత్వం చేసిన ధ‌నుష్ (Dhanush) మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత‌ ఈ రాయన్ (Raayan) చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా చెన్నైలో గ్యాంగ్ స్ట‌ర్స్‌ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 13న పాన్ ఇండియా స్థాయిలో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి తీసుకు రానున్నారు.

GNJfXXyWMAAxGbF.jpeg

అయితే ఈ సినిమా కోసం ధ‌నుష్ (Dhanush) గుడ్డు కొట్టించుకోవ‌డం పెద్ద సంచ‌ల‌నం కాగా ఆ స్టిల్స్ సోష‌ల్ మీడియాను కొంత‌కాలం షేక్ చేశాయి. ఇంత‌లా ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ఏంటీ అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య పోయారు కూడా. ప్ర‌స్తుతం ధ‌నుష్ తెలుగు స్టార్ డైరెక్ట‌ర్‌ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో నాగార్జున‌తో క‌లిసి కుబేరా (Kubera) అనే పాన్ ఇండియి సినిమాలో నటిస్తోండ‌గా ద‌స‌రాకు దిడుద‌ల కానుంది. ఇదిలాఉండ‌గా త్వ‌ర‌లోనే ధ‌నుష్‌ మ‌రో చిత్రాన్ని కూడా ధ‌నుష్ డైరెక్ట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Updated Date - May 10 , 2024 | 01:24 PM