AR Murugadoss: రూమర్స్‌కు చెక్‌.. నాలుగేళ్ల తర్వాత సినిమా!

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:19 PM

దక్షిణాది దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మురుగదాస్‌. బలమైన కథ, యాక్షన్, చక్కని సందేశం ఆయన చిత్రాల్లో ప్రత్యేకం. దాస్‌ నుంచి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతోంది.

AR Murugadoss: రూమర్స్‌కు చెక్‌.. నాలుగేళ్ల తర్వాత సినిమా!

దక్షిణాది దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు  మురుగదాస్‌. బలమైన కథ, యాక్షన్, చక్కని సందేశం ఆయన చిత్రాల్లో ప్రత్యేకం. దాస్‌ నుంచి సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. 'దర్బార్‌' చిత్రం తర్వాత ఆయన నుంచి ఏ సినిమా ప్రకటనా రాలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. మురుగదాస్‌, శివ కార్తికేయన్ కాంబినేషన్లో ఎప్పటి నుంచో సినిమా అనుకుంటున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆ రూమర్స్ కు చెక్ పెట్టి  ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

Murugu.jpg

ఈ చిత్రం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మురుగదాస్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రంలో  శివ కార్తికేయన్  సరసన 'సప్త సాగరాలు దాటి’ హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని మేకర్స్‌ తెలిపారు.


కన్నడం, తెలుగు చిత్రసీమల్లో మంచి పేరుతో పాటు గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ‘అయలాన్‌’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శివకార్తికేయన్‌ సరసన ఆమె నటించేందుకు ఎంపికయ్యారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, మృణాల్‌ ఠాగూర్‌ను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరిపినప్పటికీ చివరకు రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేశారు. కాగా, రుక్మిణి వసంత్‌ ఇప్పటికే ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి నటించే 51వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకాకముందే ఆమె మరో మూవీకి ఎంపిక కావడం కోలీవుడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Updated Date - Feb 15 , 2024 | 01:26 PM