scorecardresearch

Actress Anitha: ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:00 PM

తేజ దర్శకత్వంలో ‘నువ్వు-నేను’తో(Nuvvu -Nenu) చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు అనిత (Anitha). ప్రస్తుతం ఆమె పలు హిందీ సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తూ బిజీగా ఉన్నారు.

Actress Anitha: ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది

తేజ దర్శకత్వంలో ‘నువ్వు-నేను’తో(Nuvvu -Nenu) చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు అనిత (Anitha). ప్రస్తుతం ఆమె పలు హిందీ సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అనిత.. తన కెరీర్‌ ఎలా మొదలైందో తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. మద్యానికి బానిసైన తండ్రిని చూసి తాను ఎన్నో సందర్భాల్లో ఆగ్రహానికి లోనయ్యానని అన్నారు. ఆయనతో సరిగ్గా మాట్లాడలేకపోయానంటూ భాగోద్వేగానికి లోనయ్యానన్నారు. ‘‘నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మద్యానికి బానిసయ్యారు. అది నాకెంతో కోపం తెప్పించింది. దాంతో ఆయనతో నాకు మంచి అనుబంధం లేదు. నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు మరణించారు.

ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. అతనికి ఎదురైన ఇబ్బందుల వల్లే అలా మారారనిపిస్తుంది. ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉండాల్సింది. తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణపైనే దృష్టిపెట్టాను. దాని కోసం మొదట నటుడు కునాల్‌ గోస్వామి కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం చేశా. ‘నువ్వెందుకు సినిమాల్లోకి వెళ్లకూడదు? ఒక్కసారి ఫొటోషూట్‌లో పాల్గొను’ అని ఆయన సోదరుడే నాకు సలహా చెప్పారు. ప్రయత్నిద్దాం అనిపించింది. కొంతకాలానికి ఫొటోషూట్‌ చేశా. అనంతరం ఆడిషన్స్‌, లుక్‌ టెస్టులు చేశాక అవకాశాలు, సినిమాలు, సీరియళ్లు చేసుకుంటూ నటిగా ఈ స్థాయికి వచ్చా. ఆయన ఇచ్చిన సలహా వల్లే ఇది సాధ్యమైందనుకుంటా’’ అని అన్నారు.

 

Updated Date - Aug 31 , 2024 | 05:00 PM