Ajith Kumar: స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్‌.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:41 PM

జీవితాన్ని అనుభవించడంలో  అజిత్ (Ajith Kumar) తర్వాతే ఎవరైనా అంటున్నారు ఆయన అభిమానులు. నటుడిగా సినిమాలకు న్యాయం చేస్తూనే కుటుంబంతోనూ సరదాగా గడుపుతుంటారు. అలాగే ఆయనకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం.

Ajith Kumar: స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్‌.. ఏం జరిగిందంటే..

జీవితాన్ని అనుభవించడంలో  అజిత్ (Ajith Kumar) తర్వాతే ఎవరైనా అంటున్నారు ఆయన అభిమానులు. నటుడిగా సినిమాలకు న్యాయం చేస్తూనే కుటుంబంతోనూ సరదాగా గడుపుతుంటారు. అలాగే ఆయనకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఒక్కరే అడ్వెంచర్‌ టూర్స్‌ వేస్తుంటారు. అది కూడా వేల కిలోమీటర్లు ఆయన దగ్గరున్న స్పోర్ట్స్‌ బైక్స్‌ మీద. ఈ మధ్యనే ఆయన చెన్నై నుంచి నేపాల్‌ పరిసర ప్రాంతాలకు ఓ గైడ్‌ సాయంతో బైక్‌ టూర్‌ వేశారు. అలా ఆయనకు నచ్చింది చేస్తుంటారు  అజిత్.  తాజాగా వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్‌ చేయడం కోసం తన  స్నేహితులతో కలిసి కొన్నిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌ వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన గరిటె  చేత పట్టారు. ఆరు బయట  కిచెన్   ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్‌ కోసం ప్రత్యేకంగా బిర్యానీ వండిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘‘కుకింగ్‌లోనూ అజిత్‌ స్టైల్‌ కనిపిస్తుంది’’, ‘‘ఇలాంటి సీన్‌ సినిమాల్లో ఉంటే భలే ఉంటుంది. జీవితాన్ని అనుభవించడం, ఆస్వాదించడంలో ఆయన తర్వాతే ఎవరైనా’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఝఝఝఝఝ

గతేడాది ‘తునివు’తో అలరించారు అజిత్‌. ఇందులో డార్క్‌ డెవిల్‌ ప్రాతలో కనిపించారు. ప్రస్తుతం ‘విదా ముయార్చీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయిక.  లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబాస్కరన్   నిర్మిస్తున్నారు. అజర్‌బైజాన్‌లో ఇటీవల కొంత షూట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చాక ‘విదా ముయార్చీ’ షూట్‌లో పాల్గొననున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ చేయనున్నారు అజిత్. ఇటీవల నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన వచ్చింది. 

Updated Date - Mar 21 , 2024 | 03:41 PM