Nayattu: 'చుండూరు పోలీస్‌ స్టేషన్’ పేరుతో.. స్ట్రీమింగ్ 

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:46 PM

మలయాళంలో సూపర్‌ హిట్టైన చిత్రం ‘నాయట్టు’. కుంచకో బోబన్‌, జోజూ జార్జ్‌, నిమేషా సజయన్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్టిన్‌ దర్వకత్వం వహించిన ఈ చిత్రం 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.  

Nayattu: 'చుండూరు పోలీస్‌ స్టేషన్’ పేరుతో.. స్ట్రీమింగ్ 

మలయాళంలో సూపర్‌ హిట్టైన చిత్రం ‘నాయట్టు’ (Nayattu). కుంచకో బోబన్‌, జోజూ జార్జ్‌, నిమేషా సజయన్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్టిన్‌ (martin) దర్వకత్వం వహించిన ఈ చిత్రం 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.  ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇప్పుడు తెలుగులో కూడా ఈ చిత్రం అలరించడానికి స్ట్రీమింగ్  అవుతుంది. ‘చుండూరు పోలీస్‌ స్టేషన్’ (Chundur Police station) పేరుతో తెలుగులో రాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి స్ర్టీమింగ్‌ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్‌’ పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

కథ
కేరళలో ఎన్నికలు నడుస్తున్న వేళ అది. ప్రవీణ్‌ మైఖేల్‌ (బోబన్‌) అప్పుడే పోలీసు ేస్టషన్‌లో విధుల్లో చేరతాడు. ఏఎస్‌ఐగా మణియన్‌ (జోజు జార్జ్‌), కానిస్టేబుల్  సునీత అక్కడే పనిచేస్తుంటారు. ఓ సామాజిక వర్గానికి చెందిన యువనాయకుడితో ప్రవీణ్‌, మణియన్‌లే గొడవకు దిగుతారు. ఓ రోజు ఫంక్షన్‌కి ముగ్గురు వెళ్లొస్తుంటారు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యాక్సిడెంట్‌ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతాడు. అతడు ఎవరో కాదు.. పోలీసు ేస్టషన్‌లో గొడవకు దిగిన వ్యక్తికి దగ్గరి బంధువు. ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఏ సంబంధమూ లేని వీరి ముగ్గురిని ఉచ్చులో పడేసేందుకు ప్రణాళికలు సిద్థం అవుతున్నాయని తెలుసుకున్న మణియన్‌ మిగతా ఇద్దరితో కలిసి పోలీసు స్టేషన్ నుంచి పరారవుతాడు. దీంతో వేట మొదలవుతుంది. సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వీరిని వెంటాడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి వీరు ముగ్గురు ఆ కేసు నుంచి బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా లేదా? వీరి జీవితాలని ఎలాంటి మలుపు తిరిగాయన్నది మిగతా కథ.

Updated Date - Apr 23 , 2024 | 04:23 PM