OTTలో దేశ‌వ్యాప్తంగా.. అరవింద్ కృష్ణ ‘SIT ’ ట్రెండింగ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 12:53 PM

అరవింద్ కృష్ణ హీరోగా నటాషా దోషి హీరోయిన్‌గా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా. ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోంది.

OTTలో దేశ‌వ్యాప్తంగా.. అరవింద్ కృష్ణ ‘SIT ’ ట్రెండింగ్‌
sit

అరవింద్ కృష్ణ (Aravind Krishna) హీరోగా నటాషా దోషి హీరోయిన్‌గా విజయ భాస్కర్ రెడ్డి (Vijaya Bhaskar Reddy) తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోంది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ఆటతో మెప్పిస్తున్న అరవింద్ కృష్ణ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటున్నాడు. తాజాగా ఆయ‌న న‌టించిన‌ SIT డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లై ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.


sit (1).jpg

ప్రస్తుతం ఈ SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) సినిమా జీ5లో ట్రెండ్ అవుతోంది. ఇక త్వరలోనే ‘ఎ మాస్టర్ పీస్’ అనే సినిమాతో సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ (Aravind Krishna) రాబోతున్నాడు. ఇవే కాకుండా ఇంకా ఆయ‌న న‌టిస్తున్న‌ పలు ప్రాజెక్ట్‌లు త్వ‌ర‌లో సెట్స్ మీదకు రాబోతోన్నాయి.

Updated Date - May 30 , 2024 | 12:54 PM