పిల్లలతో విహార యాత్ర
ABN , Publish Date - Jun 02 , 2024 | 02:16 AM
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం హాంకాంగ్ పర్యటనలో...
![పిల్లలతో విహార యాత్ర](https://media.chitrajyothy.com/media/2024/20240530/8_CJ_91a6fdb1d1.jpg)
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం హాంకాంగ్ పర్యటనలో ఉన్నారు. డిస్నీల్యాండ్ రిసార్డ్స్లో దిగిన ఫొటోలను విఘ్నేశ్ షేర్ చేస్తూ ‘పన్నెండేళ్ల క్రితం ‘పోడా పోడీ’ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నాయి. షూస్ కూడా లేవు. చెప్పులతో ఈ ప్రదేశమంతా తిరిగా. ఇప్పుడు నా భార్య, పిల్లలతో ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు.