ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్ , బేబీ ' ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ తో నూతన చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:21 PM

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది.

ప్రముఖ రచయిత పురాణపండ స్విచ్ ఆన్ ,  బేబీ ' ఫేమ్ విరాజ్ అశ్విన్  క్లాప్ తో నూతన చిత్రం ప్రారంభం
viraj

రవితేజ మహాదాస్యం క‌థానాయ‌కుడిగా నూతన నిర్మాణ సంస్థ ఆర్ట్ మేకర్స్ (ART MAKERS) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు మద్దుల మదన్ కుమార్ (MADAN KUMAR MADDULA) దర్శకత్వంలో కుమారి సౌజన్య కావూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చలన చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ మణికొండ శివాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు నూతన కథానాయకుడు రవితేజ మహాదాస్యం పై ' బేబీ ' సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ (VIRAJ ASWIN ) క్లాప్ కొట్టగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

WhatsApp Image 2024-04-29 at 8.50.06 PM (1).jpeg

ఈ సంద‌ర్భంగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (PURANAPANDA SRINIVAS) మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వస్తున్న కొత్త తరం మేధస్సు, ఉత్సాహం ,ప్రతిభ, సామర్ధ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సినీ రంగంలోకి వస్తున్న ఈ తరాన్ని కొందరు ఆక్షేపించి చులకనగా చూస్తున్నారు, తరువాత వీరి సృజనాత్మక సామర్ధ్యాన్ని చూసి ఈ వెటకారపు రాయుళ్లు ముక్కున వ్రేళ్లేసుకుంటున్నారు. ఇది జరిగిన చరిత్ర. జరుగుతున్న చరిత్ర. జీవితంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దని, ఎవ్వరినీ అవమానించొద్దన్నారు.


WhatsApp Image 2024-04-29 at 8.50.06 PM.jpeg

ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ నితిన్ రెడ్డి చిమ్ముల , ఎడిటింగ్ : అఖిల్ దేశ్ పాండే , సంభాషణలు మరియు పాటలు జక్కా రాజశేఖర్ రెడ్డి , ఆర్ట్ డైరెక్టర్ మక్కెన విజయ్, తేజస్విని డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సహా నిర్మాతలు : దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి.

Updated Date - Apr 29 , 2024 | 09:21 PM