Madhuram: స్కూల్‌లో.. ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్ళకు కట్టిన్నట్లు చూపించే చిత్రం ‘మ‌ధురం’

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:33 PM

యువ న‌టుడు ఉదయ్ రాజ్ హీరోగా, వైష్ణవి సింగ్ క‌థానాయిక‌గా సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న చిత్రం మధురం. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు శ‌నివారం మీడియాతో పంచుకున్నారు.

Madhuram: స్కూల్‌లో.. ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్ళకు కట్టిన్నట్లు చూపించే చిత్రం ‘మ‌ధురం’
madhuram

యువ న‌టుడు ఉదయ్ రాజ్ (Uday Raj) హీరోగా, వైష్ణవి సింగ్ క‌థానాయిక‌గా శ్రీవెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ (Sri Venkateswara Entertainments) పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే (Rajesh Chikile) దర్శకత్వంలో యం.బంగార్రాజు (M. Bangarraju) నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ మధురం (Madhuram). సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు.

చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే (Rajesh Chikile) మాట్లాడుతూ.. ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ అని అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని,. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామ‌న్నారు. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మధురం చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారన్నారు. హీరో ఉదయ్ రాజ్ (Uday Raj) మాట్లాడుతూ.. " రీసెంట్ గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశానని.. అలాగే సినిమాల‌లో మంచి క్యారెక్టర్స్ చేశానన్నారు. అవి చూసి డైరెక్టర్ రాజేష్, మా నిర్మాత బంగార్రాజు గారు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చారన్నారు.. వారికి నా థాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టొరీ ఇదని, నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుందని, యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుందన్నారు.


WhatsApp Image 2024-02-17 at 6.47.49 PM.jpeg

నిర్మాత బంగార్రాజు (M. Bangarraju) మాట్లాడుతూ.."మా దర్శకుడు రాజేష్ చెప్పిన కథ అధ్భుతంగా నచ్చిందని, కొత్తదనం ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అలాగే మా "మధురం" సినిమా కూడా చాలా కొత్తగా నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నారు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవలే మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారని, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయనకి మా కృతజ్ఞతలన్నారు. హైదారాబాద్, పాలకొల్లు, ఆచంట, సిద్ధాంతం, రావులపాలెం, కోనసీమ ఏరియాలో షూటింగ్ చేయడం జరిగిందన్నారు. చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయని.. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారన్నారు. పాటలన్నీ కూడా కోనసీమ, మారెడుమిల్లి, రంపచోడవరం వంటి సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించామ‌ని, షూటింగ్ అంతా పూర్తైయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి సమ్మర్ లోనే సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామ‌న్నారు.

Updated Date - Feb 17 , 2024 | 07:33 PM