పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో!
ABN , Publish Date - Apr 28 , 2024 | 05:38 AM
నిర్మాత బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు వేడుకని ‘రోటీ కపడా రొమాన్స్’ యూనిట్ శనివారం నిర్వహించింది. ఆయన ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడం...
![పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో!](https://media.chitrajyothy.com/media/2024/20240428/6_CJ_d0c757fdbf.jpg)
నిర్మాత బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు వేడుకని ‘రోటీ కపడా రొమాన్స్’ యూనిట్ శనివారం నిర్వహించింది. ఆయన ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఒక్కో సినిమా తీసుకుంటూ ముందుకు నడుస్తుంటే పద్దెనిమిదేళ్లు ఎలా గడిచాయో తెలియలేదు. నేను తీసిన ప్రతి సినిమానీ నా స్నేహితులే కొన్నారు. ఇప్పుడు వస్తున్న ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రం కూడా మంచి హిట్ అవుతుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను కొనుక్కుంది. వాళ్లే త్వరలో అనౌన్స్ చేస్తారు. చాలా మంచి సినిమా తీశామనే తృప్తి ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.