Tollywood: ఈ వేసవిలో పెద్ద సినిమాల ఓపెనింగ్స్, కానీ...

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:42 PM

ఈ వేసవిలో కొన్ని పెద్ద సినిమాలు ముహుర్తాలు మొదలుపెట్టే అవకాశం వుంది అని అంటున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి నటుల సినిమాలు ఈ వేసవిలో అధికారికంగా మొదలెడతారని, కానీ ఈ వేసవికి విడుదలవ్వాల్సిన సినిమాల తేదీల్లో మార్పులు వుండే అవకాశం కూడా వుంది అని ఒక వార్త నడుస్తోంది.

Tollywood: ఈ వేసవిలో పెద్ద సినిమాల ఓపెనింగ్స్, కానీ...
Some of the big films are going to start in this summer

ఈ సంవత్సరం వేసవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని పెద్ద సినిమాలకి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఎప్పటి నుండో అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఈ వేసవిలో అధికారికంగా ప్రారంభించే అవకాశం వుంది అని అంటున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజమౌళి ఒక పెద్ద ప్రణాళికవేసి ఈ సినిమా చిత్రీకరణకు పూనుకున్నారని ఒక వార్త నడుస్తోంది. ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మించే చిత్రంగా కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ముహూర్తం ఈ వేసవిలో ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత కెఎల్ నారాయణ.

maheshbaburajamouli.jpg

అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (ట్రిపుల్ 'ఏ') కాంబినేషన్లో ఒక సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంతకు ముందే అల్లు అర్జున్ తన సామాజిక మాధ్యమం ద్వారా చాలా సార్లు మాట్లాడారు కూడా. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ వేసవిలో అధికారికంగా ప్రారంభోత్సవం అవుతుందని అంటున్నారు. ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటుంది అని చెపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా చిత్రీకరణతో చాలా బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అవగానే అట్లీ తో సినిమా ఉంటుంది అని చెపుతున్నారు. అందుకనే ఈ వేసవిలో అట్లీ సినిమా ముహూర్తం పెట్టారు అని వినికిడి.

alluarjun-atlee.jpg

ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా, అగ్ర నటుడు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక పీరియడ్ డ్రామా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముహూర్తం కూడా ఈ వేసవిలో ఉంటుందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో 'గేమ్ చెంజర్' సినిమా చిత్రీకరణలో వున్నారు. విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతోంది, ఇది ఇంకో పదిరోజులు ఉంటుందని, దీనితో 'గేమ్ చెంజర్' సినిమాలో రామ్ చరణ్ చిత్రీకరణ భాగం పూర్తయినట్టేనని అంటున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సినిమా ముహూర్తం ఈ నెలలో ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా కూడా ముహూర్తం ఈ వేసవిలో చేసే అవకాశం వుంది అని అంటున్నారు.

Ramcharan.jpg

ఇలా నాలుగు పెద్ద సినిమాలు ఈ వేసవిలో మొదలుపెట్టడం చిత్ర పరిశ్రమకి ఒక మంచి శుభసూచికం అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు భారీ వ్యయంతో కూడుకున్నవి, ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా విడుదలవుతాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15న అధికారిక విడుదల తేదీగా ప్రకటించారు. కానీ ఈ తేదీకి ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న 'కల్కి 2898 ఎడి' సినిమా వచ్చే అవకాశం వుంది అని అంటున్నారు.

Kalki-2.jpg

ఎందుకంటే మొన్ననే ఎన్నికల నగారా మోగించారు, అందుకని ఈ సినిమా మే 9 కి వచ్చే అవకాశాలు చాలా తక్కువని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మే 13న జరుగుతున్నాయి కాబట్టి, మే 9 న ఈ సినిమా వచ్చే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. అందుకని ప్రభాస్ సినిమా ఆగస్టు 15 కు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ తేదీన విడుదలవ్వాల్సిన 'పుష్ప 2' ఇంకో తేదీకి వెళ్లే అవకాశం వుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - Mar 18 , 2024 | 12:42 PM