NBK109: బాలకృష్ణ పక్కన 'సైంధవ్' హీరోయిన్

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:50 PM

నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్ సినిమాలో ఊర్వశి రౌటేలా కాకుండా ఇంకో కథానాయిక శ్రద్ధ శ్రీనాథ్ కూడా నటిస్తోంది. బాలకృష్ణ రానున్న ఎన్నికలకు సమాయత్తం అవడానికి వీలుగా అతని సన్నివేశాలని ముందుగా పూర్తి చెయ్యాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారని తెలిసింది.

NBK109: బాలకృష్ణ పక్కన 'సైంధవ్' హీరోయిన్
Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా #NBK109 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఉర్వశి రౌటేలా ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇప్పుడు ఇంకొక కథానాయిక కూడా బాలకృష్ణ పక్కన చేస్తోంది అని సమాచారం. సంక్రాంతికి విడుదలైన 'సైంధవ్' సినిమాలో వెంకటేష్ తో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు బాలకృష్ణ సరసన ఇంకో కథానాయికగా నటిస్తోంది అని తాజా సమాచారం.

శ్రద్ధ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి కూడా అడుగుపెట్టినట్టు కూడా యూనిట్ సభ్యులు చెపుతున్నారు. ఊర్వశి రౌటేలా ని ఇంతకు ముందే ఈ సినిమాకి తీసుకున్నారు, ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ కూడా అడుగుపెట్టింది. ఈ సినిమా ఒక యాక్షన్ నేపథ్యంలో సాగుతున్న సినిమాగా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈమధ్యనే విడుదలైన 'యానిమల్' సినిమాలో మాటలు రాని మూగ వ్యక్తిగా నటించి, విలన్ గా అందరినీ బాబీ డియోల్ మెప్పించిన సంగతి కూడా తెలిసిందే.

NBK109.jpg

బాలకృష్ణ తో షూటింగ్ ఇప్పుడు రాత్రి పూట జరుగుతోందని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని పక్కన ఎవరు కథానాయికగా నటిస్తున్నారు అన్న సంగతి ఇంకా ఖరారు కాలేదని కూడా తెలుస్తోంది. బాలకృష్ణ పాత్ర వున్న సన్నివేశాలన్నీ పూర్తి చెయ్యాలని దర్శకుడు బాబీ నిర్ణయించుకున్నారని, ఎందుకంటే బాలకృష్ణ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి, ప్రచారానికి వెళ్లిపోవాలని, అందుకనే అతని పోర్షన్ ముందుగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నటుగా తెలిసింది.

Updated Date - Jan 31 , 2024 | 01:50 PM