Pushpa 2: మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ 'పుష్ప' కోసం సంచనల నిర్ణయం

ABN , Publish Date - May 11 , 2024 | 01:20 PM

'పుష్ప 2' సినిమా ఎట్టిపరిస్థితులలోనూ ఆగస్టు 15వ తేదీన విడుదలచెయ్యడానికి చిత్రనిర్వాహకులు సిద్ధం అయ్యారని తెలిసింది. మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ పై చిత్రీకరణ మిగిలి ఉందని, అందుకోసం మలయాళం నటుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే...

Pushpa 2: మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ 'పుష్ప' కోసం సంచనల నిర్ణయం
Allu Arjun and Fahadh Faasil

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి చిత్ర నిర్వాహకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమాలో ఇంకా కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందని కూడా తెలిసింది. ఈ చిత్రీకరణ ఎక్కువగా మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ పైనే వున్నట్టుగా తెలుస్తోంది. అందుకని ఈ చిత్ర నిర్వాహకులు ఫహాద్ ఫాజిల్ ని సంప్రదించగా అతను ఈ సినిమా కోసం ఏకంగా ఒక నెల రోజుల పాటు తన తేదీలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. (Malayalam star Fahadh Faasil gave bulk dates to Pushpa 2)

Pushpa2.jpg

అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ కలిసి వున్న సన్నివేశాలు, అలాగే అల్లు అర్జున్, ఫహాద్, మిగతా నటీనటులు కలిపి వున్న సన్నివేశాలు, ఫహాద్ ఫాజిల్, బ్రహ్మాజీపై కూడా చాలా సన్నివేశాలు చిత్రీకరణ జరపాల్సి ఉండగా చిత్ర నిర్వాహకులు వీటన్నిటి కోసం మలయాళం నటుడిని అడిగినట్టుగా తెలిసింది.

అందుకు బదులుగా ఫహాద్ జూన్ 1వ తేదీ నుండి ఆ నెల చివరి వరకు తాను 'పుష్ప 2' కోసం కేటాయిస్తున్నట్టుగా ఆ చిత్రనిర్వాహకులకు చెప్పినట్టుగా తెలిసింది. దర్శకుడు సుకుమార్ ఈ నెలరోజుల్లో ఫహాద్ ఫాజిల్ వున్న సన్నివేశాలని పూర్తి చెయ్యడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలిసింది. (Fahadh Faasil is going to work for nearly one month for Pushpa 2 film shooting) అలాగే ఇదే సమయంలో ఈ సినిమాలో పనిచేస్తున్న ఇతర నటీనటుల తేదీలను కూడా తీసుకొని, ఆ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలని కూడా పూర్తి చెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలిసింది.

fahadfaasil.jpg

ఇక సుకుమార్ సినిమాలో వుండే ప్రత్యేక పాట కోసం జులై లో ఆలోచించాలని చిత్ర నిర్వాహకులు అనుకుంటున్నట్టుగా తెలిసింది. ముందుగా ఫహాద్ చిత్రీకరణ పూర్తయితే సినిమాలో 90 శాతం చిత్రీకరణ అయిపోయినట్టే అని, తరువాత స్పెషల్ పాట, మిగతా పాటల చిత్రీకరణ జరుపుకోవటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. (Makers of Pushpa 2 is making all efforts to release the film on August 15, as they announced earlier) ఎట్టి పరిస్థితులలోనూ ఈ 'పుష్ప 2' సినిమాని ఆగస్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర నిర్వాహకులు, అల్లు అర్జున్, సుకుమార్ పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్మిక మందన్న ఈ సినిమాలో కథానాయకురాలిగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - May 11 , 2024 | 01:20 PM