Tyson Naidu: బెల్లంకొండ ఢీ కొట్టబోయే ఆ లేడీ విలన్ ఎవరో తెలిస్తే షాకవుతారు

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:40 AM

బెల్లంకొండ కొత్త సినిమాకి 'టైసన్ నాయుడు' అనే పేరు అతని పుట్టినరోజు సందర్భంగా నిన్న అధికారికంగా ప్రకటించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక ఆశ్చర్యకరమైన విలన్ పాత్రలో ఒక అందమైన నటీమణి నటిస్తోందని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది

Tyson Naidu: బెల్లంకొండ ఢీ కొట్టబోయే ఆ లేడీ విలన్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Bellamkonda Sai Sreenivas on the sets of his film 'Tyson Naidu'

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ప్రస్తుతం సాగర్ కె చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా, తమ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మీద నిర్మిస్తున్నారు. నిన్న చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమా నుండి అతని లుక్ ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' #TysonNaidu అనే టైటిల్ కూడా పెట్టినట్టుగా అధికారికంగా చెప్పారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పాత్ర బాక్సింగ్ ఎక్స్ పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ఆసక్తికరంగా వుంది.

directorsagarchandra.jpg

బెల్లంకొండ ఈ సినిమాలో ఒక పోలీసాఫీసరుగా నటిస్తున్నారు. అతనికి మైక్ టైసన్ అంటే ఇష్టం కాబట్టి, టైసన్ నాయుడు అని పేరు పెట్టుకున్నట్టుగా నిన్న విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ ఢీ కొట్టబోయేది ఒక పవర్ ఫుల్ లేడీని అని సమాచారం. దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాలో లేడీ విలన్ అయితే బాగుటుంది అని చాలామందిని అనుకొని, చివరికి ఆ నటిని పెట్టుకున్నట్టుగా ఒక సమాచారం.

pragyajaiswaltoplayvillain.jpg

ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా, ఆమె మరెవరో కాదు ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) అని తెలిసింది. ఇంతకు ముందు క్రిష్ జాగర్లమూడి సినిమా 'కంచె' సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ తరువాత మరికొన్ని తెలుగు సినిమాలలో నటించారు, అందులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయకా' సినిమాలో కూడా నటించారు. ఆమధ్య విడుదలైన బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా 'అఖండ' #Akhanda లో కథానాయకురాలిగా నటించారు ప్రగ్యా జైస్వాల్.

pragyajaiswal.jpg

ఆమె తనకి నచ్చిన పాత్రలనే చేస్తూ కొన్ని సినిమాలు మాత్రమే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ 'టైసన్ నాయుడు' లో ఆమె విలన్ పాత్ర చేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె కన్నా ముందు చాలామందిని అనుకున్నా, కొత్తగా ఉండాలని చెప్పి ప్రగ్యా జైస్వాల్ ని ఇందులో తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 11:40 AM