Pushpa 2: ఆరు నిముషాల అల్లు అర్జున్ గంగమ్మ జాతరకి అరవై కోట్లు అయిందట

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:41 PM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' కి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. అర్జున్ పుట్టినరోజు నాడు విడుదలైన టీజర్ తో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్ గంగమ్మ గా కనపడతారు, ఇంతకీ ఆ సన్నివేశానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా...

Pushpa 2: ఆరు నిముషాల అల్లు అర్జున్ గంగమ్మ జాతరకి అరవై కోట్లు అయిందట
A still of Allu Arjun from Pushpa 2

ఇప్పుడు పరిశ్రమలో ఒక అల్లు అర్జున్ గంగమ్మగా కనిపించిన టాక్ గురించి బాగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప 2' సినిమానుండి టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ లో అల్లు అర్జున్ గంగమ్మగా అందరికీ దర్శనం ఇచ్చారు. ఇంతకు ముందే గంగమ్మ గా అల్లు అర్జున్ పోస్టర్ విడుదల చేసిన సగంతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఈ గంగమ్మ జాతర నుంచి అల్లు అర్జున్ గంగమ్మ వేషంలో వచ్చిన టీజర్ బాగా ప్రాచుర్యం పొందటమే కాకుండా, వైరల్ కూడా అయింది.

ఇప్పుడు పరిశ్రమలో ఈ టీజర్ గురించే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఈ గంగమ్మ జాతర పాట సన్నివేశం సినిమాలో ఆరు నిముషాల పాటు ఉంటుందని, ఇది సినిమాకి ఒక హైలైట్ అని చెపుతున్నారు. ఇంతకీ ఈ ఒక్క ఆరు నిమిషాల సన్నివేశానికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు. దీనికి సుమారు రూ. 60 కోట్లు వరకు అయిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

alluarjunpushpa2.jpg

Allu Arjun: అభిమానుల ఆనందోత్సాహాల మధ్య వైజాగ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌

ఎందుకంటే ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా దర్శకుడు సుకుమార్ చిత్రీకరించారని తెలిసింది. ఇందులో ఒక పాట కూడా ఉంటుంది, ఆలా ఈ సన్నివేశ చిత్రీకరణకు సుమారు నెలరోజులు తీసుకున్నట్టుగా కొంతమంది యూనిట్ సభ్యులు చెపుతున్నారు. సినిమాలో ఈ సన్నివేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, అందుకే ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరణకు సుమారు నెలరోజులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే దీనికి అంత ఖర్చు అయిందని కూడా అంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా మొదటి పార్టు 'పుష్ప' కి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న సంగతి కూడా తెలిసిందే.

'పుష్ప 2' ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈ తేదీకి రావటం కష్టం అని, అందుకని విడుదల వాయిదా పడొచ్చు అని కొన్ని కథనాలు వచ్చినా, ఇప్పుడు చిత్ర నిర్వాహకులు విడుదల తేదీ ఆగస్టు 15వ తేదీ అని ధృవీకరించారు. అయితే ఈ సినిమాకి 'పార్టు 3' కూడా ఉంటుంది అని, అందుకని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మూడో పార్ధుకి వదిలివేశారని చెపుతున్నారు. అందుకనే 'పుష్ప 2' ని అనుకున్నట్టుగా అదే తేదీకి విడుదల చెయ్యగల్గుతున్నారు అని చెపుతున్నారు. ఏమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి, ఇప్పటికే ఈ సినిమా కొనుగోలు చెయ్యడానికి భారీమొత్తంలో ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక మందన్న ఇందులో కథానాయకురాలు, ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.

Updated Date - Apr 10 , 2024 | 12:41 PM