స్నేహితుల కథతో...
ABN , Publish Date - Mar 13 , 2024 | 03:40 AM
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. తాజాగా ‘ఓ మై ఫ్రెండ్’ అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు...
![స్నేహితుల కథతో...](https://media.chitrajyothy.com/media/2024/20240306/9_CJ_58a04b583c.jpg)
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. తాజాగా ‘ఓ మై ఫ్రెండ్’ అనే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. నటుడు శివాజీ, దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ ఈ సాంగ్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘నేటి యువతకు నచ్చే సినిమా ఇది. పాటలు బాగున్నాయి. దర్శకుడు విక్రమ్రెడ్డి బాగా తీశాడు. పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడు’ అని ప్రశంసించారు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ‘మేం వయసుకు వచ్చాం’ నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని త్రినాధరావు అన్నారు. చిత్ర నిర్మాణం మీద, కథ మీద నాలెడ్జ్, గ్రిప్ ఉన్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ అని ప్రసన్నకుమార్ అన్నారు. ‘కొత్తవాళ్లతో ఈ రోజుల్లో సినిమా తీయడానికి గట్స్ కావాలి. కంటెంట్ మీద నమ్మకం ఉండాలి. ఇది మ్యాటర్ ఉన్న సినిమాలా అనిపిస్తోంది’ అన్నారు.