ఎవరూ టచ్ చేయని పాయింట్తో...
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:00 AM
‘బిగ్బాస్’ అమర్దీప్ హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా నటించే చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్కు నిర్మాత ఎ.ఎం.రత్నం...
![ఎవరూ టచ్ చేయని పాయింట్తో...](https://media.chitrajyothy.com/media/2023/20231205/4_Cj_7b3ac55569.jpg)
‘బిగ్బాస్’ అమర్దీప్ హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా నటించే చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్కు నిర్మాత ఎ.ఎం.రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బసిరెడ్డి క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ‘భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్తో ఈ సినిమా తీస్తున్నాం’ అని చెప్పారు. ‘బిగ్బాస్’ హౌస్లోకి వెళ్లకముందే ఈ సినిమాకు సైన్ చేసినట్లు హీరో అమర్దీప్ చెప్పారు. నటి సురేఖా వాణి మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్ విన్న తర్వాత వీళ్లు చేస్తారా లేదా అనే అనుమానం వచ్చింది. దర్శకనిర్మాతల మీద నమ్మకంతోనే నా బిడ్డను వాళ్ల చేతులో పెట్టా’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఫొటోగ్రఫీ: బాల సరస్వతి.