Venu - Balagam: నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు భావోద్వేగం..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:55 PM

బలగం చిత్రంతో యావత్‌ తెలుగు తెలుగు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేశాడు దర్శకుడు వేణు యెల్దండి.. జబర్దస్త్‌ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా ఎదిగారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు.

Venu - Balagam: నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు భావోద్వేగం..!

బలగం చిత్రంతో యావత్‌ తెలుగు తెలుగు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేశాడు దర్శకుడు వేణు యెల్దండి.. జబర్దస్త్‌ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా ఎదిగారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమెడియన్‌గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం సినీలోకానికి తెలిసింది. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకొంది.

Balagam.jpg

తాజాగా దర్శకుడు వేణు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆయన తండ్రి ఫొటో షేర్‌ చేసి ుూనేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు. ఒక్క మానాన్న తప్ప.. మిస్‌ యూ నాన్న’ అంటూ పోస్ట్‌ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - Feb 08 , 2024 | 11:55 PM