వాఘాలో వందేమాతరం
ABN , Publish Date - Jan 18 , 2024 | 05:34 AM
వరుణ్తేజ్ కథానాయకుడిగా భారత వైమానిక దళం నేపథ్యంలో రూపొందుతున్న దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ కథానాయిక. ప్రతాప్సింగ్ హడా దర్శకత్వంలో సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు...
![వాఘాలో వందేమాతరం](https://media.chitrajyothy.com/media/2023/20231205/1_CJ_681bc0092d.jpg)
వరుణ్తేజ్ కథానాయకుడిగా భారత వైమానిక దళం నేపథ్యంలో రూపొందుతున్న దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ కథానాయిక. ప్రతాప్సింగ్ హడా దర్శకత్వంలో సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 16న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని యూనిట్ బుధవారం పంజాబ్లోని వాఘా సరిహద్దుల్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో వరుణ్తేజ్, మానుషి చిల్లర్ చిత్రబృందంతో పాల్గొన్నారు. వైమానిక దళం యుద్ధానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వచ్చే గీతమిది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మిక్కీ జే మేయర్ స్వరపరచగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.