మనసుల్ని కదిలించే సినిమా ఇది
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:46 AM
‘ఈ సినిమాకోసం ఎక్కువరోజులు ప్రిపేర్ అయ్యాను. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నాను. కథతో కనెక్ట్ అవ్వడానికి సీన్స్ మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేశాను. పాత్ర కోసం రెండు సార్లు గుండు గీయించుకున్నాను. నా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మంచి ఫలితం వస్తుందని...
![మనసుల్ని కదిలించే సినిమా ఇది](https://media.chitrajyothy.com/media/2023/20231205/12_Cj_f3564b59d2.jpg)
‘ఈ సినిమాకోసం ఎక్కువరోజులు ప్రిపేర్ అయ్యాను. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నాను. కథతో కనెక్ట్ అవ్వడానికి సీన్స్ మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేశాను. పాత్ర కోసం రెండు సార్లు గుండు గీయించుకున్నాను. నా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మంచి ఫలితం వస్తుందని ఆశగా ఉన్నాను. అన్నారు హీరో సుహాస్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్బ్యాండు’. శివాని నాగారం కథానాయిక. దుష్యంత్ కటినేని దర్శకుడు. వెంకటేశ్ మహా, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాస్ విలేకరులతో ముచ్చటించారు. ‘దుష్యంత్ రాసిన కథ నన్ను కదిలించింది. రియల్లై్ఫలో తను చూసిన కొన్ని సంఘటనల స్ఫూర్తి ఈ కథలో ఉంది. లాక్డౌన్ టైమ్ కాబట్టి స్ర్కిప్ట్ను బాగా స్టడీ చేసే అవకాశం దొరికింది. కథ మీద నమ్మకంతోనే గుండు గీయించుకున్నా. 2007లో జరిగే కథ ఇది. ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడ్నుంచి వేరే లెవల్కు వెళుతుంది. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ ఫీల్. ‘కలర్ ఫొటో’ను మించిన హై ఎమోషన్ ఈ కథలో ఉంటుంది’ అని చెప్పారు సుహాస్. ఇంకా మాట్లాడుతూ ‘మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. నేను, శరణ్య కవలలం. మాఇద్దరి పుట్టినరోజున జరిగిన సంఘటనలు మీ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం. కథలోని చాలా సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఫైనల్ కాపీ చూశాక సినిమాపై నమ్మకం కుదిరింది. ముఖ్యంగా శేఖర్చంద్ర నేపథ్య సంగీతం సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లింది. ఇందులో కథానాయికగా పరిచయం అవుతున్న శివానికి మంచి ఫ్యూచర్ ఉంది. మంచి నటి తను. సినిమా విషయంలో మేమంతా కాన్ఫిడెంట్తో ఉన్నాం. ఫిబ్రవరి 2న అందరూ థియేటర్కెళ్లి చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు సుహాస్.