Vishwaksen : సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తున్నారు
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:27 AM
‘సినిమా చూసి నిజాయితీగా సమీక్ష రాయడంలో తప్పు లేదు. కానీ కొంతమంది సినిమా చూడకుండానే ఆ పని చేస్తున్నారు. మరికొందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు రాస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రేక్షకులు ‘గ్యాంగ్స్ ఆఫ్
![Vishwaksen : సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తున్నారు](https://media.chitrajyothy.com/media/2024/20240530/Gangs_of_godavari_134ecb7b51.jpg)
‘సినిమా చూసి నిజాయితీగా సమీక్ష రాయడంలో తప్పు లేదు. కానీ కొంతమంది సినిమా చూడకుండానే ఆ పని చేస్తున్నారు. మరికొందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు రాస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రేక్షకులు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని చూసేందుకు వస్తున్నారు’ అని హీరో విష్వక్సేన్ అన్నారు. ఆయన హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విష్వక్సేన్ మీడియాతో మాట్లాడుతూ ‘కొన్నాళ్లుగా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడి కనిపించ లేదు. ఇప్పుడు మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కోసం మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. మా సినిమాకు వస్తున్న ప్రేక్షకాధరణకు చాలా ఆనందంగా ఉంది. ‘విష్వక్ సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపుతార’ని ప్రశంసలు వస్తున్నాయి. నాలోని నటుడిగా సవాల్ విసిరేలా ఉంటేనే సినిమా చేయడం అలవాటు. ఇకముందు కూడా ఇలాంటి కొత్తదనం ఉన్న కథలతో వస్తాను’ అన్నారు. ‘బాలకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా బావుందని మెచ్చుకున్నారు. మంచి వసూళ్లు వస్తున్నాయని అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్పారు. దీనికి త్వరలోనే సీక్వెల్ చేస్తాం’ అని కృష్ణ చైతన్య చెప్పారు.