వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్
ABN , Publish Date - Jan 17 , 2024 | 06:11 AM
వచ్చే సంక్రాంతికి కోసం పన్నెండు నెలలు ముందుగానే బెర్త్ రిజర్స్ చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనరుపై 2017లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘శతమానం భవతి’ చిత్రాన్ని....
![వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్](https://media.chitrajyothy.com/media/2023/20231205/4_Cj_6292abfafa.jpg)
వచ్చే సంక్రాంతికి కోసం పన్నెండు నెలలు ముందుగానే బెర్త్ రిజర్స్ చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనరుపై 2017లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘శతమానం భవతి’ చిత్రాన్ని ఆయన నిర్మించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం భారీ సినిమాల పోటీని తట్టుకుని నిలబడి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం చాటింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘శతమానం భవతి నెక్ట్స్ పేజ్’ను రూపొందిస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2025 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామనీ ఆయన వెల్లడించారు.