ఆర్ఆర్ఆర్... అంతకుమించి
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:18 AM
మహేశ్బాబు హీరోగా ఎస్.ఎ్స.రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీని వర్కింగ్ టైటిల్ ఎస్ఎ్సఎంబీ29. శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్పై డాక్టర్ కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు...
మహేశ్బాబు హీరోగా ఎస్.ఎ్స.రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీని వర్కింగ్ టైటిల్ ఎస్ఎ్సఎంబీ29. శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్పై డాక్టర్ కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులపైనే మేకర్స్ దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. ఇటీవల అంతర్జాతీయ జర్నలిస్టులతో ఆయన మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఎన్టీఆర్, రామ్చరణ్లతోపాటు జంతువులు పాల్గొన్న యాక్షన్ సన్నివేశం సినిమాకు హైలెట్గా నిలిచింది. అంతర్జాతీయంగా రాజమౌళికి ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మహేశ్బాబుతో తీయబోయే సినిమాలో కూడా జంతువుల సీక్వెన్సులు ఉంటాయని రాజమౌళి తెలిపారు. ఈ మూవీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేందుకు పలు తరగతులకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పారు. కాగా, ఈ మూవీ షూట్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.