ఈ తరానికి రామానుజ సందేశం

ABN , Publish Date - May 29 , 2024 | 06:36 AM

డాక్టర్‌ సాయి వెంకట్‌ నటి స్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సుమన్‌, జో శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా...

ఈ తరానికి రామానుజ సందేశం

డాక్టర్‌ సాయి వెంకట్‌ నటి స్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సుమన్‌, జో శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని జూలై 12న విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి వెంకట్‌ మాట్లాడుతూ ‘మానవాళి ఐకమత్యంతో ఉండాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన గురువు భగవత్‌ శ్రీ రామానుజాచార్యులు. వారి గొప్పదనం ఈ తరానికి తెలియాలనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అన్నారు. ప్రవల్లిక మాట్లాడుతూ ‘ఈ సినిమా నిర్మాణంలో భాగమవడంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాను. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది’ అని చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 06:36 AM